Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 46

Diti's sorrow !

బాలకాండ
నలుబది ఆఱవ సర్గము
(అసుర మాత దితి దుఃఖము)

హతేషు తేషు పుత్త్రేషు దితిః ప రమ దుఃఖితా |
మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదమబ్రవీత్ ||

స|| హే రామా ! తేషు పుత్రేషు హతేషు దితిః పరమ దుఃఖితా ( అస్తి) భర్తారం కాశ్యపం మారీచం ఇదం అబ్రవీత్ |

తా|| ఓ రామా ! తన పుత్రులు చంపబడటవలన దితికి చాలా దుఃఖము తో భర్త మరీచుని పుత్రుడు అయిన కాశ్యపునితో ఇట్లు పలికెను.

హతపుత్త్రాs స్మి భగవన్ తవపుత్రైర్మహబలైః |
శక్రహంతారమిఛ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితమ్||

స|| హే భగవన్ ! మహాబలైః తవ పుత్రైః హత పుత్రా అస్మి | దీర్ఘ తపోర్జితం పుత్రం శక్ర హంతారం ఇచ్ఛామి |

తా|| ఓ భగవన్ ! మహాబలవంతులైన నీ పుత్రలచే చంపబడిన పుత్రులు కలదానను అయితిని |దీర్ఘమైన తపము ఒనరించి ఇంద్రుని చంపగల పుత్రుని కోరుకొనెదను.

సాహం తపః చరిష్యామి గర్భం మే దాతు మర్హసి |
ఈశ్వరం శక్ర హంతారం త్వ మనుజ్ఞాతు మర్హసి||
తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాస్యపస్తథా |
ప్రత్యువాచ మహాతేజా దితిమ్ పరమదుఃఖితామ్ ||

స|| అహం తపః చరిష్యామి త్వం అనుజ్ఞాతు మర్హసి | ఈశ్వరం శక్ర హంతారం గర్భం మే దాతుమర్హసి |మారీచః కస్యపః మహాతేజా తథా తస్యాః తద్ వచనం శ్రుత్వా పరమదుఃఖితాం దితిం ప్రత్యువాచ

తా|| నేను తపస్సు చేసెదను. నీవు అనుమతి ఇచ్చుటకు అర్హుడవు. ముల్లోకములకు అధిపతి , ఇంద్రుని చంపగల పుత్రుని ప్రసాదించుము. మహాతేజోవంతుడైన మరీచుని పుత్రుడగు కాశ్యపుడు ఆమె యొక్క ఆ వచనములను విని పరమ దుఃఖిత అయిన దితి తో ఇట్లు పలికెను.

ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే |
జనయిష్యతి పుత్త్రం త్వం శక్రహంతార మాహవే||
పూర్ణే వర్ష సహస్రే తు శుచిర్యది భవిష్యసి |
పుత్త్రం త్రైలోక్య భర్తారం మత్తస్త్వం జనయిష్యసి ||
ఏవముక్త్వా మహాతేజాః పాణినా సమమార్జతామ్ |
సమాలభ్య తతః స్వస్తీ త్యుక్త్వా స తపసే యయౌ ||

స|| హే తపోధనే ఏవం భవతు | భద్రం తే |త్వం శుచిర్భవ మాహవే శక్ర హంతారం పుత్రం జనయిష్యతి|యది సహస్రే వర్ష పూర్ణే శుచిః భవిష్యతి తదా పుత్త్రం త్రైలోక్య భర్తారం మత్తః త్వం జనయిష్యసి |మహాతేజాః పాణినా సమ మార్జతాం తతః సమాలభ్య స్వస్తీ ఇతి యుక్త్వా స తపసే యయౌ |

తా|| 'ఓ తపోధనులారా ! అట్లే అగుగాక | నీకు శుభమగుగాక | నీవు పవిత్రము అగుగాక .ఇంద్రుని హతమొనర్చగల పుత్రుడు జన్మించెదడు. నీవు వేయి సంవత్సరములు పూర్తిగా పతివ్రతగా ఉండినచో ముల్లోకములకు అధిపతి అగు నా పుత్రునికి నీవు జన్మనిచ్చెదవు'. ఇట్లు చెప్పి హస్తముతో ఆదరించి శుభమగుగాక అని చెప్పి తపమాచరించుటకు వెళ్లెను.

గతే తస్మిన్ నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా |
కుశప్లవన మాసాద్య తపస్తేపే సుదారుణం ||
తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకార హ |
సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణ సంపదా ||
అగ్నిం కుశాన్ కాష్ఠ మపః ఫలం మూలం తథైవ చ|
న్యవేదయత్ సహస్రాక్షో యచ్ఛాన్యదపి కాంక్షితమ్ ||
గాత్ర సంవాహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా |
శక్రస్సర్వేషు కాలేషు దితిం పరిచచార హ ||

స|| హే నరశ్రేష్ఠ! తస్మిన్ గతే పరమహర్షితా దితిః కుశ ప్లవనం ఆసాద్య సుదారుణం తపః తేపే |హే నరస్రేష్ఠ ! తస్యాం తపః హి కుర్వంత్యాం సహాస్రాక్షః పరయా గుణ సంపదా పరిచర్యాం చకార హ |సహస్రాక్షః అగ్నిం కుశాన్ కాష్ఠమ్ ఆపః ఫలం మూలం తథైవ అన్యదపి కాంక్షితం యచ్ఛాన్ చ న్యవేదయత్ |శక్రః సర్వేషు కాలేషు గాత్రః సంవాహనైశ్చ ఏవ శ్రమాపనయనైస్తథా దితిం పరిచచార హ |

తా||'ఓ నరశ్రేష్ఠా ! ఆయన వెళ్ళిపోగా దతి పరమ హర్షముతో కుశప్లవనము చేరి తపస్సును ఆచరించెను. ఓ నరశ్రేష్ఠా ! అమె అట్లు తపమొనర్చుచుండగా సహస్రాక్షుడు వినయముతో పరిచర్యలను చేయసాగెను. ఇంద్రుడు అగ్నిని, కుశలను, సమిధలను, నీరు, కంద మూల ఫలములు అలాగే కావలసిన వస్తువులన్నీ సమకూర్చుచుండెను. ఇంద్రుడు అన్ని సమయములలోనూ అవయవములను ఆదరించుచూ శ్రమ తోలగునట్లు చేయుచూ పరిచర్యలు సలిపెను.

అథ వర్ష సహస్రే తు దశోనే రఘునందన|
దితిః పరమ సంప్రీతా సహస్రాక్షమ్ అథాబ్రవీత్||
యాచితేవ సుర శ్రేష్ఠ తవపిత్రా మహాత్మనా |
వరో వర్ష సహస్రాంతే దత్తో మమ సుతం ప్రతి ||
తప శ్చరంత్యా వర్షాణి దశ వీర్యవతాం వర |
అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః ||
తమహం త్వత్కృతే పుత్త్ర సమధాస్యే జయోత్సుకమ్ |
త్రైలోక్యవిజయం పుత్త్రం సహభోక్ష్యసి విగత జ్వరః ||

స|| హే రఘునందనా ! సహస్రవర్షే దశోనే తు పరమ సంప్రీతా దితి సహస్రాక్షం అబ్రవీత్ | హే సురస్రేష్ఠా ! తవ పిత్రా మహాత్మనా వరో యాచితేవ సహస్ర వర్షే అంతే సుతం దత్తో మమ ప్రతి | వీర్యవతాం వర తపః చరంత్యా దశ వర్షాణి అవశిష్ఠాని | తతః భ్రాతరం ద్రక్ష్య సే |భద్రం తే | త్వత్కృతే పుత్త్ర జయోత్సుకం తం అహం సమధాస్యే | త్రైలోక్య విజయం పుత్రం సహ భోక్ష్యసే విగత జ్వరః |

తా|| ఓ రఘునందన ! వేయిసంవత్సరములలో పది సంవత్సరములు ఉండగా దితి అతి సంతోషముతో ఇంద్రునితో ఇట్లు చెప్పెను. "ఓ సురశ్రేష్ఠా ! మహాత్ముడైన నీ తండ్రి వరము అడిగినప్పుడు వేయిసంవత్సరములు తరవాత నాకు పుత్రుని ప్రసాదించెను . ఓ పరాక్రమశాలీ ! నా తపస్సు లో ఇంకా పది సంవత్సరములు మిగిలి ఉన్నయి. అప్పుడు నీ తమ్ముని చూడగలవు. నీకు శుభమగుగాక .నిన్ను చంపగల పుత్రుడు విజయమునకు ఉత్సకుడైనప్పుడు అప్పుడు నేను శాంతపరచెదను. త్రిలోక విజయము ఆ పుత్రునితో అనుభవించెదవు".

ఏవముక్త్వా దితిశ్శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే |
నిద్రయాపహృతా దేవీ పాదౌ కృత్వాsథ శీర్షతః ||
ద్రుష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్థజామ్ |
శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ ||

స|| దితిః శక్రం ఏవం ఉక్త్వా దివాకరం మధ్యం ప్రాప్తే | దేవీ నిద్రయా అపహృతా అథ శీర్షతః పాదౌ కృత్వా ( భభూవ)| శిరః స్థానే కృతం పాదౌ, పాదతః కృత మూర్థజాం తాం అశుచిం దృష్ట్వా శక్రః జహాస చ ముమోద చ |

తా|| దితి ఈ విధముగా చెప్పచుండగా మధ్యాహ్నమయ్యెను. దేవి నిద్రలో శిరస్సు పాదములవేపు పడెను. శిరస్సు పాదములను తాకెను. పాదములు కేశములను తాకెను. అ అశుచి కర్మను చూచి ఇంద్రుడు దరహాసముతో సంతోషపడెను.

తస్య శరీరవివరం వివేశ చ పురందరః |
గర్భం చ సప్తథా రామ భిభేద పరమాత్మవాన్ ||
భిద్యమనస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా |
రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత ||

స|| హే రామ ! పురందరః తస్య శరీర వివరం వివేశ గర్భం చ సప్తథా భిభేద పరమాత్మన్| హే రామ ! శత పర్వణా వజ్రేణ గర్భో భిద్యమనః తతో రురోద సుస్వరం తతః దితిః అభుధ్యత|

తా|| ఓ రామా ! ఇంద్రుడు ఆమె శరీరములో ప్రవేశించి గర్భమును ఏడుముక్కలుగాచేసెను. ఓ రామా ! నూరు అంగుళముల వజ్రాయుథము తో గర్భము చేధింపగా సుస్వరముతో ఏడవసాగెను. అప్పుడు దితికి తెలిసెను.

మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోsభ్యభాషత |
భిభేద చ మహాతేజా రుదంతమపి వాసవః ||
న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితి రబ్రవీత్ |
నిష్పపాత తతశ్శక్రో మాతుర్వచన గౌరవాత్ ||

స|| శక్రః మారుదో మారుదశ్చ ఇతి అభ్యభాషత | రుదంతమపి వాసవః మహతేజా (తం) భిభేద చ | దితిః న హంతవ్యో న హంతవ్యో ఇతిః ఏవం అబ్రవీత్ | శక్రః మాతుర్వచన గౌరవాత్ తతః నిష్పపాత |

తా|| ఇంద్రుడు ఏడవకుము ఏడవకుము అని చెప్పెను. ఏడుచుచున్ననూ మహాతేజోవంతుడైన ఇంద్రుడు మరల ఛేదించెను. దితి "చంపకుము" "చంపకుము" అని పలికెను. ఇంద్రుడు తల్లి మాతమీద గౌరవము తో అచటినుండి బయటికి వచ్చెను.

ప్రాంజలివజ్ర సహితో దితిం శక్రోs భ్యభాషత |
అశుచిర్దేవీ సుప్తాసి పాదయోః కృతమూర్ధజః ||
తదంతర మహం లబ్ధ్వా శక్ర హంతారమాహవే |
అభిందం సప్తధా దేవీ తన్మే త్వం క్షంతుమర్హసి ||

స|| శక్రః వజ్ర సహితో ప్రాంజలి అభ్యభాషత | దేవీ పాదయోః కృత మూర్ధజః అశుచిః సుప్తాసి | తదంతరం లబ్ధ్వా అహం శక్రహంతారం సప్తధా అభిందం ఆహవే | దేవీ తన్మే త్వం క్షంతుమర్హసి |

తా|| వజ్రాయుధముతో నున్న ఇంద్రుడు నమస్కరించి ఇట్లు పలికెను. ఓ దేవీ పాదములవేపు శిరముంచి నీవు అశుచివి అయితివి. ఆ అవకాశము చూచి నేను ఇంద్రుని హతమార్చగల గర్భమును ఏడువిధములుగా చేసితిని. ఓ దేవీ అందువలన నన్ను క్షమించుము "

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్చత్వారింశ స్సర్గః ||
సమాప్తం ||

 


|| om tat sat ||